News July 4, 2024
కూటమి ఎంపీలతో ముగిసిన చంద్రబాబు భేటీ

AP: ఢిల్లీలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో డిన్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన తండ్రి డి.శ్రీనివాస్ మరణించడంతో అర్వింద్ను సీఎం పరామర్శించారు. కాగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
Similar News
News April 6, 2026
ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. నెట్టింట విమర్శలు

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘స్థాపనా దివస్ సందర్భంగా.. హిందూ ధర్మం ముసుగులో ద్వేషాన్ని పెంచుతూ దేశ ఆర్థిక వ్యవస్థను, సామరస్యాన్ని దెబ్బతీసిన ఫేక్ ఫకీర్’ గుర్తుకు వచ్చారు’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన శిష్యులకు విద్వేషాన్ని నూరి పోస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఊహించాలంటూ నెటిజన్లను కోరారు. PM మోదీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
News April 6, 2026
తాత్కాలిక సీజ్ఫైర్ కోసం హార్ముజ్ని తెరిచేది లేదు: ఇరాన్

ఓవైపు అమెరికాతో థర్డ్ పార్టీ ద్వారా సంధి ప్రయత్నాలు జరుగుతున్నా హార్ముజ్ రీఓపెనింగ్పై ఇరాన్ పట్టువీడట్లేదు. తాత్కాలిక సీజ్ఫైర్ కోసం హార్ముజ్ని తెరిచేది లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు, డెడ్లైన్లకు లొంగి తాము నిర్ణయాలు తీసుకోబోమని తెలిపింది. కాగా అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పెట్టిన <<19580239>>ప్రపోజల్స్లో<<>> ఈ హార్ముజ్ రీఓపెనింగ్ కూడా ఉన్నట్లు సమాచారం.
News April 6, 2026
డేటింగ్ యాప్స్ యూసేజ్ ఈ టైమ్లోనే ఎక్కువ

ఇండియాలో ఓ ప్రముఖ డేటింగ్ యాప్లోని ట్రెండ్స్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాయి. ఎక్కువ మంది 12-3Pm మధ్య యాప్స్ను యూజ్ చేస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఆఫీసుకు వెళ్లేవాళ్లకు ఇది లంచ్ టైమ్. ఈ లీజర్ టైమ్లో యాప్స్ ఓపెన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే 10Pm నుంచి అర్ధరాత్రి వరకూ వాటిల్లోకి లాగిన్ అవుతున్నట్లు తెలిసింది. యావరేజ్గా ఒక్కో యూజర్ యాప్స్పై గంటన్నర టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు తేలింది.


