News March 27, 2024
చంద్రబాబు ‘ప్రజాగళం’ షెడ్యూల్

AP: నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో CBN పర్యటించనున్నారు.
Similar News
News April 6, 2026
TODAY HEADLINES

*ఎన్నికల్లో గెలిచాక టీఎంసీ పాపాల లెక్క తేలుస్తాం: మోదీ
*నీటి సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్: CBN
*కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్
*అసలు సినిమా ముందుంది: రాఘవ్ చడ్ఢా
*హార్ముజ్ను దాటిన 9వ భారత నౌక
*డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్నే నాశనం చేస్తా: ట్రంప్
*IPL: SRHపై LSG, చెన్నైపై బెంగళూరు గెలుపు
News April 6, 2026
ఫైటర్ జెట్ కూలిపోయింది కానీ పైలట్లు సేఫ్: US

ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో తమ <<19559906>>F-15E<<>> ఫైటర్ జెట్ కూలిపోయిందని అమెరికా ధ్రువీకరించింది. అందులోని ఇద్దరు పైలట్లు ఇరాన్ భూభాగంలో పడిపోగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి విజయవంతంగా వారిని రక్షించామని తెలిపింది. ఇరాన్పై తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా పైలట్లను రక్షించే క్రమంలో అమెరికా పలు ఎయిర్ క్రాఫ్ట్లను కోల్పోయింది.
News April 6, 2026
డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్నే నాశనం చేస్తా: ట్రంప్

ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్లైన్ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.


