News July 31, 2024

గనుల శాఖపై నేడు చంద్రబాబు సమీక్ష

image

AP: గనుల శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. YCP నేతలు ఇసుక ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారని, క్వార్ట్జ్, సిలికాశాండ్ వంటివాటిల్లోనూ భారీగా దండుకున్నారని NDA కూటమి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై CM ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.19,137కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేటి సమీక్షలో సీఎం ఆ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాక్.

Similar News

News December 7, 2025

రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

image

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.

News December 7, 2025

ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

image

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News December 7, 2025

37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

image

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.