News September 29, 2024

భయంతోనే చంద్రబాబు సిట్ ఏర్పాటు: సజ్జల

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై YCP కోర్టుకు వెళ్లడంతో CM చంద్రబాబు భయపడి సిట్ వేశారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లడ్డూపై తాను చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని చెప్పారు. ‘లడ్డూపై CM తప్పుడు ఆరోపణలు చేయలేదనుకుంటే కూటమి ప్రభుత్వమే సుప్రీం విచారణను కోరుతూ అఫిడవిట్ వేయాల్సింది. ఎలాంటి ఆధారాలు, ధైర్యం లేకనే సిట్ విచారణ అంటూ హడావుడి చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News December 1, 2025

విజయ్ నాకు శత్రువు కాదు: కమల్ హాసన్

image

TVK అధినేత విజయ్‌ తనకు శత్రువు కాదని సినీ నటుడు, MP కమల్ హాసన్ అన్నారు. కులతత్వమే తన ప్రధాన శత్రువని, దాన్ని అంతమొందించాలని చెప్పారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్, లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ‘విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. ఇది సరైన సమయం కాదు. అనుభవం మన కన్నా గొప్ప టీచర్. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు. మనకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు’ అని తెలిపారు.

News December 1, 2025

ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం పెన్షన్ల పంపిణీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అటు నల్లమాడులో P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఉంగుటూరులో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య నేతలతో CM భేటీ కానున్నారు. 3.35PMకు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.

News December 1, 2025

నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

image

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’