News June 7, 2024
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. CBN ప్రమాణస్వీకారానికి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు రానున్నారు.
Similar News
News December 20, 2025
ఏపీ ఇంటర్ బోర్డుకు అరుదైన ఘనత: మంత్రి లోకేశ్

AP ఇంటర్ బోర్డుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ (NCVET) రికగ్నిషన్ లభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలో అవార్డింగ్ బాడీ (AB-డ్యుయల్)గా గుర్తింపు పొందిన తొలి బోర్డుగా AP ఇంటర్ బోర్డు నిలిచిందన్నారు. దీని వల్ల వొకేషనల్ స్కిల్స్కు నేషనల్ లెవెల్లో సర్టిఫికేషన్ ఇచ్చే అర్హత BIEకి దక్కిందని తెలిపారు. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్కు అనుమతి లభించిందన్నారు.
News December 20, 2025
విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి: CBN

AP: విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని CM CBN పేర్కొన్నారు. వారంతా నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే 75 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని చెప్పారు. కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం స్కూలు విద్యార్థులతో CM మాట్లాడారు.
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.


