News January 29, 2025
ఏపీ కోసం చంద్రబాబు కష్టాలు: మంత్రి శ్రీధర్ బాబు

TG: ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్కు వచ్చే కంపెనీలను ఏపీ తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు. ‘చంద్రబాబు హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఏపీకి గ్లోబల్ క్యాపబులిటీ ఉంది. ఆ రాష్ట్రానికి తీర ప్రాంతం, సహజ వనరులు అపారంగా ఉన్నాయి. ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
ఈ రోజుల్లో సాధారణ భక్తులకు దర్శనాలుండవు: TTD

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 30,31, జనవరి 1వ తేదీల్లో సర్వ దర్శనం, స్పెషల్ ఎంట్రీ, శ్రీవాణి వంటి దర్శనాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ మూడు రోజులు ఈ-డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. సాధారణ భక్తులు ఈ మూడు రోజుల్లో దర్శనాలకు వచ్చి ఇబ్బంది పడొద్దని టీటీడీ సూచించింది. 2026, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సాధారణ భక్తులూ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని తెలిపింది. share it
News December 5, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 5, 2025
Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 రన్స్కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.


