News July 12, 2024
అక్టోబర్ 18 నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పు

OCT18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ వేళలు మారుతాయని SCR ప్రకటించింది. SECBAD-గూడూరు సింహపురి(12710) రా.10.35కి బదులు రా.10.05కి బయల్దేరుతుంది. SECBAD-తిరుపతి పద్మావతి(12764) గూడూరును ఉ.4.43కి బదులు ఉ.4.19కి చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి(12734) సా.6.25కి బదులు సా.5.30 స్టార్టవుతుంది. నర్సాపూర్-నాగర్సోల్(17231) రా.11.15కు బదులు రా.9.50కి బయల్దేరుతుంది.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


