News October 11, 2024

16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

image

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

Similar News

News December 12, 2025

వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

image

టాలీవుడ్ <<18541857>>నటులు<<>> వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కోర్టులకు కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే?.. కాపీరైట్, IT, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయ స్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, అనేక టెక్ దిగ్గజాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తాయి. ఢిల్లీ HC ఉత్తర్వులు దేశం మొత్తం వర్తిస్తాయని దీన్ని ఆశ్రయిస్తుంటారు.

News December 12, 2025

మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్.. BJP ఆందోళన

image

HYDలోని సింగరేణి కార్యాలయం ముట్టడికి BJP నేతలు యత్నించారు. రేపు అర్జెంటీనా స్టార్ మెస్సీతో జరిగే ఫుట్‌బాల్ మ్యాచు కోసం సింగరేణి ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. BJP నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కాగా ఈ మ్యాచుతో ప్రభుత్వానికి సంబంధం లేదని <<18532050>>CM రేవంత్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.

News December 12, 2025

నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం.. క్యాంప్ రాజకీయాలు షురూ

image

AP: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న ప్రవేశపెట్టనుండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కార్పొరేటర్లను గోవాకు తరలించేందుకు TDP ప్లాన్ చేస్తోందని YCP ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 54 కార్పొరేటర్ స్థానాల్లో YCP గెలవగా తర్వాత మెజార్టీ సభ్యులు TDPలో చేరారు. తాజాగా ఐదుగురు తిరిగి YCP గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది.