News July 2, 2024
‘కులగురు’గా వీసీ పదవి పేరు మార్పు

రాష్ట్రంలోని యూనివర్సిటీల ‘వైస్ ఛాన్స్లర్’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న జీవిత భాగస్వాములను కులపతి భర్తలుగా పేర్కొనడం ఇబ్బందిరకంగా మారింది’ అని సీఎం పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 2, 2026
పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
‘ఉపాధి’కి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం

TG: ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు. ఉపాధి పనులకు గతంలో కేంద్రమే 100% నిధులు కేటాయించేదని, ఇప్పుడు 60-40 శాతానికి మార్చడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.


