News July 2, 2024
‘కులగురు’గా వీసీ పదవి పేరు మార్పు

రాష్ట్రంలోని యూనివర్సిటీల ‘వైస్ ఛాన్స్లర్’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న జీవిత భాగస్వాములను కులపతి భర్తలుగా పేర్కొనడం ఇబ్బందిరకంగా మారింది’ అని సీఎం పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 13, 2025
టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/
News December 13, 2025
బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


