News November 17, 2024
రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు?

APలో హైస్కూళ్ల టైమింగ్స్ మార్చడంపై విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిలబస్ కవర్ చేయడం సహా టీచర్లు ఒత్తిడి లేకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పేలా సా.5 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతి మండలంలో ఒక స్కూలులో ఈ టైమింగ్స్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News October 30, 2025
అసలు ఎవరీ శివాంగీ సింగ్..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా యుద్ధ విమాన పైలట్ శివాంగీ సింగ్తో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అసలెవరీమె అంటూ చర్చ మొదలైంది. శివాంగీ వారణాసిలో పుట్టి పెరిగారు. చదువుకొనేటప్పుడే NCCలో చేరారు. 2016లో ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికై మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపారు. అలా 2020లో రఫేల్ మొదటి మహిళా పైలెట్గా చరిత్ర సృష్టించారు.
News October 30, 2025
6వ తరగతి నుంచి ఆయుర్వేద పాఠాలు

దేశవ్యాప్తంగా ఇకపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఆయుర్వేదాన్ని బోధించనున్నారు. NEPలో భాగంగా సైన్సు సబ్జెక్టులో ఈ అంశాల్ని చేర్చాలని అధికారులు నిర్ణయించారు. 6-8వ తరగతి వరకు ఈ పాఠాలుంటాయి. ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణంపై భారతీయ దృక్కోణంతో అవగాహన కలిగించడమే లక్ష్యమని NCERT డైరక్టర్ దినేశ్ ప్రసాద్ తెలిపారు. స్కూల్ స్థాయి నుంచి ఆరంభమైన దీన్ని రానున్న కాలంలో డిగ్రీ కోర్సులకూ విస్తరించే అవకాశముంది.
News October 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 51 సమాధానాలు

1. బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టిన వానరుడు ‘జాంబవంతుడు’.
2. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి?
3. కృష్ణుడి భార్య అయిన రుక్మిణికి తండ్రి పేరు ‘భీష్మకుడు’.
4. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని నుదుటి నుంచి జన్మించిన వీరుడు ‘వీరభద్రుడు’?
5. గరుత్మంతుడి తల్లి ‘వినత’.
<<-se>>#Ithihasaluquiz<<>>


