News July 22, 2024

ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

image

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్‌కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.

Similar News

News December 11, 2025

నేటి నుంచి బీజేపీ బస్సు యాత్ర

image

AP: మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఇవాళ్టి నుంచి ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర చేయనుంది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.

News December 11, 2025

నేడు ఆ స్కూళ్లకు సెలవు

image

TG: రాష్ట్రంలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లకు గానూ నిన్న కూడా ఈ పాఠశాలలకు హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13, 14.. 16, 17 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆయా బడుల్లో అదనపు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.

News December 11, 2025

భవానీ దీక్షల విరమణ.. భారీ ఏర్పాట్లు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ మండల దీక్ష విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి AP, TGతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి 7L మంది భవానీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ కోసం 9KM మార్గాన్ని సిద్ధం చేశారు. దర్శనం కోసం 13 కౌంటర్లు, 3 హోమగుండాలు, నిత్యాన్నదానం, రైల్వే, బస్ స్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.