News July 22, 2024
ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.
Similar News
News December 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 35

ఔర దేవతా చిత్త న ధరయీ|
హనుమత సేయి సర్వ సుఖ కరయీ||
మహాబలశాలి, చిరంజీవి అయిన హనుమంతుడిని నిరంతరం తలచుకోవడం ద్వారా మనం అన్ని కష్టాలు, భయాల నుంచి విముక్తి పొంది, సకల సౌఖ్యాలను పొందుతాము. ఆంజనేయ స్వామిని నమ్మిన వారికి సర్వదా విజయమే కలుగుతుంది. ఆయనను భక్తితో ఆరాధించిన వారికి అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, శుభాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 11, 2025
వేసవి కరెంటు కష్టాలు గట్టెక్కించేలా ‘యాదాద్రి’

TG: వేసవిలో విద్యుత్ డిమాండ్కు తగ్గ ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టింది. 2026 FEB నాటికి ఉత్పత్తి జరిగేలా 4000 MW ‘యాదాద్రి’ ప్లాంటును సిద్ధం చేస్తోంది. అప్పటికల్లా GENCO దీని సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉత్పత్తి ప్రారంభమైతే బయటినుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం తప్పుతుంది. వేసవిలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 17,500 MWగా ఉండగా ఈసారి 18000 MWకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 11, 2025
శ్రవణ్ సాయి హత్య.. సంచలన ఆరోపణలు

కృష్ణా(D)కు చెందిన శ్రవణ్ సాయి <<18525669>>హత్య కేసులో<<>> మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నా కూతురు గర్భవతి అని తెలిసింది. తప్పు చేసిందని ఆమెను కొట్టబోతుండగా అడ్డురావడంతో అతడికి దెబ్బలు తగిలాయి. ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని అతడికి నా కూతురు మెసేజ్ చేసిందట’ అని అమ్మాయి తల్లి తెలిపారు. శ్రవణ్ను టార్చర్ చేసి చంపారని, ఒంటిపై గాయాలున్నాయని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.


