News July 22, 2024
ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.
Similar News
News December 18, 2025
పెంచికల్పేట్ శివారులో పులి సంచారం..!

కమాన్పూర్ మండలం పెంచికల్పేట్- బుర్రకాయలపల్లి మధ్య పొలం మార్గంలో పులి సంచారం జరిగిందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ కొమురయ్య యాపల వాగు సమీపంలో పులి ఆనవాళ్ల కోసం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పరిశీలనలో స్థానిక నాయకుడు పల్లె నారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
News December 18, 2025
514 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 20 – JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/CFA/CMA-ICWA, MBA/PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850. SC, ST, PwBDలకు రూ.175. వెబ్సైట్: bankofindia.bank.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 18, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<


