News July 22, 2024

ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

image

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్‌కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.

Similar News

News December 12, 2025

3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లు బ్లాక్.. కేంద్రం ప్రకటన

image

2025 JAN నుంచి ఇప్పటివరకు 3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. AKAMAI వంటి యాంటీ బాట్ టూల్స్‌తో నకిలీ అకౌంట్లను బ్లాక్ చేశామన్నారు. జనరల్, తత్కాల్ టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని లోక్‌సభలో తెలిపారు. తత్కాల్ బుకింగ్స్‌లో ఆధార్ లింక్డ్ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

News December 12, 2025

తడబడిన భారత్.. SA ఘన విజయం

image

రెండో టీ20లో 214 రన్స్ బిగ్ ఛేజింగ్ గేమ్‌లో టీమ్ ఇండియా 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 51 రన్స్ తేడాతో SA ఘన విజయం నమోదు చేసింది. తిలక్ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. జితేశ్(27) ఫర్వాలేదనిపించారు. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. SA బౌలింగ్‌లో బార్ట్‌మన్ 4, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి తలో 2 వికెట్లు తీశారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.

News December 12, 2025

వీళ్లు పొరపాటున కూడా కీరదోస తినొద్దు!

image

అజీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కీరదోస తినకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్లు తింటే గ్యాస్, ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉన్నందున జలుబు, సైనస్ సమస్యలు, బ్రాంకైటిస్, ఉబ్బసం, కఫంతో బాధపడేవాళ్లు, ఎక్కువరోజులు జలుబుతో ఇబ్బందిపడేవాళ్లు తినకూడదు. ముక్కు దిబ్బడ, దగ్గు ఉన్నవాళ్లు తింటే సమస్య ఎక్కువవుతుంది.