News July 22, 2024

ఆరో తరగతి పుస్తకంలో మార్పులు

image

NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్‌కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని ‘మధ్య రేఖ’ అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేడ్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను ‘సింధు సరస్వతి’గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.

Similar News

News December 11, 2025

మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

image

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.

News December 11, 2025

ఈ ఉదయం 7 గంటల నుంచి..

image

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మ.1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది.. 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 5 గ్రామాలకు, 169 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.

News December 11, 2025

గురువారం బృహస్పతిని పూజిస్తే..

image

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.