News March 16, 2024

81 స్థానాల్లో మార్పులు

image

AP: వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యే స్థానాల్లో 81 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చింది. అలాగే 18 మంది సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిలో పలువురిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేయగా మరికొంత మందికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దాదాపు 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామని.. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని సీఎం జగన్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం టికెట్లు ఇచ్చామని చెప్పారు.

Similar News

News March 3, 2026

నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత

image

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రామరాజు(85) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతో HYDలోని మధురానగర్ స్వగృహంలో ఈ ఉదయం చనిపోయారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు శివాజీ రాజా ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News March 3, 2026

గుంటూరు జిల్లాలో 14 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

గుంటూరు జిల్లా స్త్రీ&శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News March 3, 2026

అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

image

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.