News December 10, 2024
CUET- 2025 ఎడిషన్లో మార్పులివే

2025 నుంచి UG లో ప్రవేశాలకు Common University Entrance Testలో విద్యార్థులు గరిష్ఠంగా ఆరుకు బదులు 5 సబ్జెక్టులు రాయగలరు. *సబ్జెక్టుల సంఖ్య 63 నుంచి 37కి తగ్గింపు. *కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షల్లో ఐచ్ఛిక ప్రశ్నలను తొలగించడంతో అన్ని ప్రశ్నలను 60 Minలో అటెంప్ట్ చేయాలి. *12వ తరగతిలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టు పరీక్షకైనా హాజరుకావచ్చు. Share It.
Similar News
News January 7, 2026
రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP: రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది. ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.
News January 7, 2026
TG ప్రాజెక్టులకు చిల్లు పెట్టడం లేదు కదా: లోకేశ్

AP: TGని దాటి వచ్చే గోదావరి నీటినే రాష్ట్ర పరిధిలో తాము వినియోగిస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. నల్లమలసాగర్పై TG అభ్యంతరాల పట్ల స్పందిస్తూ ‘అక్కడి ప్రాజెక్టులకు మేం చిల్లు పెట్టడం లేదు కదా? ఆ ప్రాంతం దాటి వచ్చిన నీరు వృథాగా సముద్రంలోకి పోకుండా వాడుకుంటున్నాం. 1 TMC కోసం గతంలో వివాదాలు జరిగాయి. దేశాల మధ్య యుద్ధాలూ జరిగాయి. వేస్ట్గా పోయే నీరు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకూ ఇవ్వొచ్చు’ అన్నారు.
News January 7, 2026
ఇక సర్కార్ వంతు.. టికెట్ రేట్ల పెంపు ఉంటుందా?

TG: ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘రాజాసాబ్’ సినిమాల టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం ప్రభుత్వానిదేనని <<18786947>>హైకోర్టు<<>> స్పష్టం చేయడంతో సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నిర్మాతలు సర్కారుకు ప్రతిపాదనలు పంపడంతో పాటు సీఎంతో చర్చించాకే కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టికెట్ రేట్లు పెంచేది లేదని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతల్లో అయోమయం నెలకొంది.


