News August 21, 2024

ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు

image

TG: ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 8 నుంచి మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23 వరకు కొనసాగుతుంది. 24వ తేదీ నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. 27న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. 30న సీట్లు కేటాయిస్తారు. 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కాలేజీలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి.

Similar News

News December 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 96 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: సూర్యుడి వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి, సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్లిపోయింది ఎవరు?
సమాధానం: సూర్య భగవానుడి భార్య అయిన సంజ్ఞా దేవి తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి అడవులకు వెళ్లిపోయింది. సూర్యుని ద్వారా సంజ్ఞా దేవికి యముడు, యమున జన్మించారు. ఛాయాదేవికి శని, సావర్ణి, తపతి జన్మించారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News December 14, 2025

ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

image

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.

News December 14, 2025

ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.