News October 18, 2024

మధ్యాహ్న భోజనంలో మార్పులు!

image

AP: నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

Similar News

News November 8, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

image

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 8, 2025

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంతంటే?

image

పలు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌(ADR) నివేదిక విడుదల చేసింది. APలో మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులు రూ.11,323 కోట్లు కాగా తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.4,637 కోట్లుగా పేర్కొంది. దేశంలో అత్యధికంగా కర్ణాటక ఎమ్మెల్యేలకు రూ.14,179 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అటు దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో KAలో 31 మంది, APలో 27 మంది ఉన్నారు.