News August 18, 2024

ఆధార్ క్యాంపుల షెడ్యూల్‌లో మార్పులు

image

AP: రాష్ట్రంలో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆధార్ క్యాంపుల షెడ్యూల్ మారింది. టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ సర్వీస్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆపరేటర్లకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.

Similar News

News December 21, 2025

అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

image

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్‌చాట్‌లో విమర్శించారు.

News December 21, 2025

రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం.. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

image

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.

News December 21, 2025

పైరేటెడ్ మూవీ యాప్స్‌తో జాగ్రత్త: MHA హెచ్చరిక

image

ఫ్రీ సినిమాల కోసం పర్సనల్ డేటా, సెక్యూరిటీని రిస్క్‌లో పెట్టుకోవద్దని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫ్ఫైర్స్ హెచ్చరించింది. తెలియని యాప్స్‌లో లభించే పైరేటెడ్ కంటెంట్ చూస్తే సైబర్ రిస్క్‌, లీగల్ ఇబ్బందులు ఎదురుకావొచ్చని చెప్పింది. లక్షల మంది వాడుతున్న ‘Pikashow App’ కూడా సురక్షితం కాదని తెలిపింది. ఈ యాప్స్‌తో మొబైల్‌లోకి వచ్చే మాల్‌వేర్, స్పైవేర్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.