News August 18, 2024

ఆధార్ క్యాంపుల షెడ్యూల్‌లో మార్పులు

image

AP: రాష్ట్రంలో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆధార్ క్యాంపుల షెడ్యూల్ మారింది. టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ సర్వీస్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆపరేటర్లకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.

Similar News

News December 20, 2025

28కేసులపై 23న ప్రివిలేజ్ కమిటీ విచారణ

image

AP: శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈనెల 23న సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో తమ హక్కులకు భంగం కలిగిన ఘటనలపై శాసనసభ్యులు అందించిన ఫిర్యాదులతో పాటు సభ నుంచి అందిన ప్రతిపాదనలపై కమిటీ విచారించనుంది. వీటికి సంబంధించి బాధ్యులైన అధికారులను సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందించినట్లు కమిటీ అధ్యక్షుడు బి.టి.నాయుడు పేర్కొన్నారు. 28 కేసులపై చర్చించనున్నట్లు తెలిపారు.

News December 20, 2025

Money Tip: తొందరొద్దు.. 48 గంటలు ఆగండి!

image

పెద్దగా ఆలోచించకుండా ఏదైనా వస్తువు కొనడాన్ని Impulsive Buying అంటారు. దీనివల్ల అనవసరమైన వాటిని కొని దీర్ఘకాలంలో ₹లక్షల్లో నష్టపోతాం. దీనికి పరిష్కారమే 48 గంటల రూల్. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆర్డర్ చేయకుండా 2 రోజులు ఆగాలి. ఆ గ్యాప్‌లో ఆ వస్తువు అవసరమా కాదా మీకే అర్థమవుతుంది. ఇలా ఖర్చులు తగ్గించి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

News December 20, 2025

సర్పంచ్ ఫలితాలు.. 18 మంది ఎమ్మెల్యేలపై PCC చీఫ్ అసంతృప్తి

image

TG: సర్పంచ్ ఫలితాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని 18 మంది MLAలపై AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్స్‌ను బుజ్జగించలేకపోవడం, బంధువులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహించారు. ఫలితాలపై CM రేవంత్ క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని రివ్యూ చేశారు. కొంత మంది MLAలను పార్టీపరంగా మందలించేందుకు ఆ నివేదికను PCC చీఫ్‌కు పంపించగా ఇవాళ సమీక్ష నిర్వహించారు.