News April 24, 2024

ఒత్తిడి వలన గర్భస్థ శిశువు ముఖంలో మార్పు

image

గర్భంపై పడే ఒత్తిడి కూడా శిశువు రూపురేఖల్ని నిర్ణయిస్తుందని లండన్‌లోని యూసీఎల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆ వివరాలను ‘నేచర్ సెల్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. దాని ప్రకారం.. చిట్టెలుక, కప్పల అండాలపై వారు పరిశోధనలు చేశారు. గర్భసంచిలో ఒత్తిడి ఉంటే అతి సున్నితంగా ఉండే గర్భస్థ శిశువు రూపురేఖలు మారిపోతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే వైకల్యం కూడా రావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Similar News

News December 24, 2025

పళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

image

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటినుంచి దంతాలకు కావాల్సిన క్యాల్షియం, ఫాస్ఫరస్ అందుతాయి. పాలకూర, తోటకూర తినడం వల్ల విటమిన్ A, C, ఫోలేట్ అందుతాయి. ఆపిల్స్, క్యారట్స్, నారింజ, మామిడి, ఉసిరికాయలు, చేపలు, గుడ్లు తినాలి. తీపి పదార్థాలు, చిప్స్, స్పైసీ ఫుడ్స్ తినడం తగ్గించాలంటున్నారు. పంటి ఆరోగ్యం బావుంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.

News December 24, 2025

రూ.100 కోట్ల అక్రమాస్తులు.. కిషన్ నాయక్‌కు 14 రోజుల రిమాండ్

image

TG: మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన నివాసాల్లో చేస్తున్న <<18652795>>సోదాల్లో<<>> పలు జిల్లాల్లో 40 ఎకరాల పొలం, హోటళ్లు, భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల పైగానే ఉంటుందని సమాచారం.

News December 24, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

‘విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది’ అందుకే పంట అధిక దిగుబడి, ఆదాయం కోసం తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవాలి. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తన రకాలను స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తీసుకోవాలి. విత్తనాలను కొనుగోలు చేసే క్రమంలో రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.