News December 31, 2024
కొత్త ఏడాదిలో మార్పులివే..

* ఫీచర్ ఫోన్లలో ‘యూపీఐ 123పే’ చెల్లింపులు రూ.5వేల నుంచి రూ.10 వేలకు కేంద్రం పెంచింది.
* ఎలాంటి గ్యారంటీలు లేకుండా రైతులు రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చని RBI తెలిపింది
* చాలా కాలంగా ‘జీరో బ్యాలెన్స్’ ఉన్న, 2 ఏళ్లకు పైగా లావాదేవీలు జరపని, ఇన్యాక్టివ్ అకౌంట్స్గా నిర్ధారించిన బ్యాంకు ఖాతాలను మూసేయాలని RBI నిర్ణయించింది.
* ఏటీఎం నుంచి PF డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
Similar News
News January 15, 2026
ఇరాన్ నో ఫ్లై జోన్.. ఇండిగో విమానం జస్ట్ మిస్!

ప్రభుత్వ వ్యతిరేక ఉద్రిక్తతల మధ్య గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేసింది. అయితే జార్జియా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం గగనతలం మూతపడటానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతాన్ని దాటిన చివరి విదేశీ ప్యాసింజర్ విమానం ఇదే కావడం విశేషం. ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎయిరిండియా సహా పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి.
News January 15, 2026
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో అప్రెంటిస్ పోస్టులు

ఢిల్లీలోని DRDOకు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీలో 33 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc/BE/BTech/Diploma/ITI/BA/B.Com అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in
News January 15, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.


