News December 31, 2024

కొత్త ఏడాదిలో మార్పులివే..

image

* ఫీచర్ ఫోన్లలో ‘యూపీఐ 123పే’ చెల్లింపులు రూ.5వేల నుంచి రూ.10 వేలకు కేంద్రం పెంచింది.
* ఎలాంటి గ్యారంటీలు లేకుండా రైతులు రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చని RBI తెలిపింది
* చాలా కాలంగా ‘జీరో బ్యాలెన్స్’ ఉన్న, 2 ఏళ్లకు పైగా లావాదేవీలు జరపని, ఇన్‌యాక్టివ్ అకౌంట్స్‌గా నిర్ధారించిన బ్యాంకు ఖాతాలను మూసేయాలని RBI నిర్ణయించింది.
* ఏటీఎం నుంచి PF డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.

Similar News

News January 29, 2026

నెల్లూరు జిల్లాలో సబ్సిడీ ఇస్తున్నా..!

image

జిల్లాలో పశువులు 57,774, బర్రెలు 6,46,106, గొర్రెలు 10,95,197, మేకలు 3,86,929 చొప్పున ఉన్న పశు సంపదకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎనిమల్ షెల్టర్స్ పడకేశాయి. జిల్లాకు 2700 షెల్టర్స్ మంజూరైతే 800 మాత్రమే పూర్తవ్వగా మిగిలిన 1900 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. పశువులకు రూ.2.30 లక్షలకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలకు రూ.2.30 లక్షలు, పౌల్ట్రీ కింద రూ.1.32 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నారు.

News January 29, 2026

అమరావతిలో న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ

image

AP: రాజధాని అమరావతిలో ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) రీజినల్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో రూ.100కోట్లతో ఆఫీస్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు నిన్న CRDA అధికారులతో ఆ కంపెనీ చీఫ్ రీజినల్ మేనేజర్ వి.రాజా ఒప్పందం చేసుకున్నారు. టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో 200-225 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

News January 29, 2026

మేడారం జాతరలో మహిళ ప్రసవం

image

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్‌ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.