News August 22, 2024
‘కల్కి’ ఓటీటీ వెర్షన్లో మార్పులు.. గమనించారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724332626284-normal-WIFI.webp)
‘కల్కి’ సినిమా నిడివి థియేటర్లలో 181min ఉండగా, <<13909598>>OTTలో<<>> 175కు తగ్గింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ప్రభాస్-దిశాపటానీ సాంగ్, ఫైట్లు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్లను ట్రిమ్ చేశారు. థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ యాడ్ చేశారు. డబ్బింగ్లోనూ మార్పులు కనిపించాయి. థియేటర్ రిలీజ్ టైమ్లో నిడివి ఎక్కువైందన్న టాక్ రావడంతోనే ఇప్పుడు కుదించినట్లు తెలుస్తోంది. మీరు OTT వెర్షన్లోని ఈ మార్పులను గమనించారా?
Similar News
News February 13, 2025
మంత్రి సురేఖపై పరువునష్టం దావా.. విచారణ 27కు వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739011911707_1032-normal-WIFI.webp)
TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫు లాయర్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
News February 13, 2025
కుంభమేళాలో చాయ్వాలా ఆదాయం తెలిస్తే షాక్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739430325570_653-normal-WIFI.webp)
కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 13, 2025
లోక్సభ ముందుకు కొత్త IT బిల్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720723755-normal-WIFI.webp)
లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్సభను వాయిదా వేశారు.