News January 1, 2025

రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు

image

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. రైళ్ల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 20, 2025

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

image

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.

News December 20, 2025

సన్న బియ్యం బోనస్ జమ కాకపోతే ఏం చేయాలి?

image

TG: వరి సన్నాలు సాగు చేసిన రైతుల అకౌంట్లలో సర్కారు బోనస్ జమ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే బోనస్ పడుతుంది. ఒకవేళ రైతు ఖాతాల్లో బోనస్ జమ కాకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలి. పౌరసరఫరాలశాఖ వెబ్‌సైట్‌లోని ‘ఫార్మర్ కార్నర్’లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జ్‌ను సంప్రదించాలి.

News December 20, 2025

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లో 24 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 12వరకు అప్లై చేసుకోవచ్చు. Tech. స్టాఫ్, Tech. సపోర్ట్ స్టాఫ్, అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, MSc, M.Tech, PhD, డిప్లొమా, టెన్త్+ITI, ఇంటర్, డిగ్రీ, PG, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: stpi.in