News July 17, 2024

యూపీ కేబినెట్‌లో మార్పులు?

image

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.

Similar News

News December 31, 2025

ఇన్సెంటివ్స్ పెంచిన స్విగ్గీ, జొమాటో

image

డెలివరీ పార్ట్‌నర్స్ స్ట్రైక్‌తో ఇవాళ బిజినెస్ నష్టపోకుండా ఈ కామర్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. డెలివరీలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు జొమాటో, స్విగ్గీ పార్ట్‌నర్స్‌కు మెసేజెస్ పంపాయి. డెలివరీకి ₹120-150తో ఇవాళ ₹3000 వరకు సంపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అటు పికప్ రిజెక్షన్, క్యాన్సిలేషన్స్ తదితరాలపై పెనాల్టీలూ ఉండవు. స్విగ్గీ అయితే నేడు, రేపు ₹10k వరకు ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తోంది.

News December 31, 2025

Money Tip: మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్ అవుతుందో తెలుసా?

image

మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి ‘72’ ఒక మ్యాజిక్ నంబర్. ఉదాహరణకు మీకు 8% వడ్డీ వస్తుంటే.. 72ను 8తో భాగిస్తే వచ్చే 9 ఏళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 6 ఏళ్లలోనే మీ పెట్టుబడి డబుల్ అవ్వాలనుకుంటే మీకు 12% వడ్డీ ఇచ్చే స్కీమ్ ఎంచుకోవాలని ఇది చెబుతుంది. ద్రవ్యోల్బణం మీ డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో కూడా ఈ సింపుల్ ట్రిక్ ద్వారా చిటికెలో లెక్కించవచ్చు.

News December 31, 2025

దుర్భరంగా స్వర్ణకారుల జీవితం

image

బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీతో ఆభరణాలు తయారు చేస్తుండటంతో సంప్రదాయ స్వర్ణకారుల జీవితం కుదేలవుతోంది. నెలకు వేల రూపాయలు సంపాదించిన కార్మికులు ప్రస్తుతం రోజువారీ కూలీలుగా మారుతున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. తరతరాలుగా కొనసాగిన వృత్తి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.