News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 12, 2026
CEERIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News February 12, 2026
ఓపిక తగ్గిపోతోందా?

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.
News February 12, 2026
IPLలో అన్సోల్డ్.. PSLలో ఖరీదైన ప్లేయర్

IPL వేలంలో అన్సోల్డ్గా మిలిగిన స్టీవ్ స్మిత్కు PSLలో రికార్డు స్థాయి ధర లభించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధికంగా PKR 14 కోట్ల(₹4.54Cr)కు ఆయనను సియాల్కోట్ స్టాలియన్స్ సొంతం చేసుకుంది. బౌలర్ నసీమ్ను PKR 8.65 కోట్లకు, అష్రఫ్ను PKR 8.5 కోట్లకు ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్కు పెషావర్ టీమ్ PKR 7 కోట్లే వెచ్చించడం గమనార్హం. మార్చి 26 నుంచి మే 3 వరకు 8 జట్లతో PSL జరగనుంది.


