News July 17, 2024

యూపీ కేబినెట్‌లో మార్పులు?

image

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.

Similar News

News February 10, 2026

ఇస్రో దూకుడు.. స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, 80 శాటిలైట్లపై వర్క్..!

image

సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు ISRO ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. మానవ సహిత గగన్‌యాన్ స్పేస్ మిషన్, ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. రీసెర్చ్, విపత్తు నిర్వహణ, భద్రత, నావిగేషన్‌తోపాటు గగన్‌యాన్ మిషన్ కోసం సంకేతాలను భూమికి పంపడంలో కీలక పాత్ర పోషించే మొత్తం 80 ఉపగ్రహాలపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.

News February 10, 2026

జననాయగన్ సెన్సార్ వివాదం.. CBFCపై కేసు వెనక్కి!

image

జననాయగన్ సినిమా సెన్సార్ విషయంలో CBFCపై వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించారు. చట్టపరమైన చర్యలకు బదులు సినిమాలో మార్పులు చేసి మరోసారి రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూస్‌తో వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

News February 10, 2026

ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నట్లు సమాచారం. ORR సమీపంలోని మున్సిపాలిటీలలో ఓటుకు ఏకంగా రూ.10-30వేల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఓ అభ్యర్థి గెలిస్తే అర తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. చాలా చోట్ల ఓటుకు రూ.3-5వేల వరకు పంచడమే కాకుండా చికెన్/మటన్, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.