News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 3, 2026
శుక్రవారమే సినిమా రిలీజ్లు ఎందుకో తెలుసా?

* శని, ఆదివారాల్లో సెలవు కావడం
* కొన్నేళ్ల క్రితం శుక్రవారం పేమెంట్స్ ఇచ్చేవారు. ఆ రోజు విడుదల చేస్తే ఫ్యామిలీస్తో సినిమాలకు వస్తారని భావించడం.
* 1939, DEC 15 (శుక్రవారం)న ‘Gone with the Wind’ సినిమా విడుదలై భారీ విజయం సాధించడం
* 1960, AUG 5 శుక్రవారమే విడుదలైన ‘Mughal-e-Azam’ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం
– చాలాకాలం నుంచి అదే ట్రెండ్ సౌత్లోనూ కొనసాగినా ఇటీవల గురువారం విడుదల చేస్తున్నారు.
News February 3, 2026
మద్యం అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు: పవన్

AP: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి’ అని స్పష్టం చేశారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
News February 3, 2026
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్

AP: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. FEB 8 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఫ్రీగా లడ్డూలు అందించాలని నిర్ణయించింది. అదే విధంగా క్యూలైన్లలో పాలు, బిస్కెట్లు, అల్పాహారం సైతం పంపిణీ చేయనుంది. భక్తుల సౌకర్యం కోసం మంచినీరు, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. 14, 15వ తేదీల్లో టోల్ ఫీజు లేకుండా వాహనదారులను అనుమతించనుంది.


