News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 9, 2026
శ్రీవారి భక్తులకు శుభవార్త

AP: తిరుమలలో సులభంగా లడ్డూలు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో UPI పేమెంట్లను అనుమతించాలని TTD నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులొస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. తొలుత కొన్ని కౌంటర్లలో అమలు తర్వాత అన్ని కేంద్రాలకూ విస్తరిస్తారు.
News February 9, 2026
ట్రేడ్ డీల్లో రైతాంగానికి రక్షణ: అమూల్ చీఫ్

USతో ట్రేడ్ డీల్తో వ్యవసాయ రంగానికి <<19081420>>నష్టం కలుగుతుందని<<>> రైతు సంఘాలు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. అయితే ఈ డీల్ రైతులు, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తుందని అమూల్ చీఫ్ జయన్ మెహతా తెలిపారు. ‘వాణిజ్య చర్చలనేవీ ఎప్పుడూ రెండు వైపులా జరిగే విషయాలు. DDGS వంటి పశువుల దాణాను డీల్లో చేర్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదు. DDGS వాడకం చాలా తక్కువ. పాడి, వ్యవసాయ రంగంపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.
News February 9, 2026
బాలీవుడ్ హీరో స్టైల్లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

బాలీవుడ్ హీరో స్టైల్లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన విజయ్సింగ్ చౌహాన్ (51) సూరత్లోని టెక్స్టైల్ మార్కెట్లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్కు క్యాష్తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


