News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 24, 2025
రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.
News November 24, 2025
సందీప్ వంగా డైరెక్షన్ టీమ్లో స్టార్ కిడ్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News November 24, 2025
INDvsSA.. భారమంతా బ్యాటర్లపైనే!

IND, SA మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నేడు మూడో రోజు ఆట కీలకం కానుంది. భారత్ విజయావకాశాలపై ఈరోజు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్లో SA భారీ స్కోర్(489) చేయడంతో IND బ్యాటర్ల బాధ్యత మరింత పెరిగింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సిన అవసరముంది. ఈ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ కీలకంగా మారతారని అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం IND 480 రన్స్ వెనుకబడి ఉంది.


