News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 3, 2026
పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని YCP ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అటు తమ పార్టీ నేతలపై జరిగిన దాడుల గురించి వివరించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి కోరామని, NHRCకి ఫిర్యాదు చేస్తామని YV సుబ్బారెడ్డి తెలిపారు.
News February 3, 2026
నాని-సుజిత్ మూవీ అప్డేట్!

హీరో నాని టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్తో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు నెట్టింట వార్తలొస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ లో నటిస్తున్నారు.
News February 3, 2026
ఏడాది తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత మణిపుర్లో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. BJP ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది. తొలుత ఇద్దరే అనుకున్న సీఎం రేసులో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. మాజీ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన పీఠానికి సత్యబ్రత సింగ్, విశ్వజిత్ సింగ్ సహా ఆరుగురు పోటీలో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.


