News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 11, 2025
ఈ నూనెలతో మేకప్ తొలగిద్దాం..

మేకప్ వేసుకోవడంతో పాటు దాన్ని తియ్యడంలో కూడా జాగ్రత్తలు పాటిస్తేనే చర్మ ఆరోగ్యం బావుంటుందంటున్నారు నిపుణులు. వాటర్ ఫ్రూఫ్ మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల సులువుగా శుభ్ర పడటంతో పాటు చర్మం కూడా తాజాగా ఉంటుంది. కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా మేకప్ పోతుంది. ఇది సహజ క్లెన్సర్ గానూ పని చేస్తుంది. తేనె, బాదం నూనె కలిపి మేకప్ తీసినా చర్మం పాడవకుండా ఉంటుంది.
News December 11, 2025
సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కూతురి విజయం

TG: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం <<18450009>>తిమ్మయ్యపల్లిలో<<>> తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరిమధ్య హోరాహోరీగా పోరు జరగగా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. సుమ గతంలో గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఢీకొన్నాయి.


