News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News December 21, 2025
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగి చూడండి!

లేవగానే లెమన్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే దానికి చిటికెడు పసుపు కలిపితే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘లెమన్ వాటర్లో ఉండే విటమిన్ సీ శరీరంలోని టాక్సిన్స్ను క్లియర్ చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా, కిడ్నీలకు కావాల్సిన సపోర్ట్ను కూడా అందిస్తుంది’ అని చెబుతున్నారు.
News December 21, 2025
BRS ఆధ్వర్యంలో జల సాధన ఉద్యమం?

తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని BRS ఆరోపిస్తోంది. ఇవాళ్టి పార్టీ కార్యవర్గ సమావేశంలో వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు దీనిపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
News December 21, 2025
మరిగించిన టీ.. 20 నిమిషాల తర్వాత తాగుతున్నారా?

టీ కాచిన 20 నిమిషాల తర్వాత తాగడం మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్లో ఆక్సిడేషన్ జరిగి బ్యాక్టీరియా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రెండోసారి కాచిన టీ తాగితే జీర్ణాశయ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు. 24 గంటల తర్వాత టీని జపాన్లో పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా, చైనాలో విషంతో పోలుస్తారు. ఫ్రిజ్లో నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది.


