News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News January 28, 2026
అలాంటి పసుపుకే మంచి ధర: మార్కెటింగ్ శాఖ

TG: పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12%లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాడి, గోల, చూర వంటి మలినాలు లేకుండా శుభ్రపరచిన పసుపును తేవాలని సూచించింది. NZB మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.
News January 28, 2026
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
News January 28, 2026
ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు అవాస్తవం: వాట్సాప్

ప్రైవసీ ఉల్లంఘన <<18971131>>ఆరోపణలను<<>> WhatsApp మాతృసంస్థ Meta ఖండించింది. ‘మీ మెసేజ్లు ప్రైవేట్గానే ఉంటాయి. ఓపెన్ సోర్స్ సిగ్నల్ ప్రోటోకాల్తో ఎన్క్రిప్ట్ (హైడ్) చేస్తాం. మీ డివైజ్ నుంచి బయటకు వెళ్లే ముందే మెసేజ్లు ఎన్క్రిప్ట్ అవుతాయి. మీరు ఎవరికి పంపారో వాళ్లు మాత్రమే చదవగలరు. వాట్సాప్, మెటా వాటిని యాక్సెస్ చేయలేవు’ అని స్పష్టం చేసింది. కాగా Meta మెసేజ్లను చదవగలదని USలో దావా దాఖలవడంతో ఇలా స్పందించింది.


