News July 17, 2024
యూపీ కేబినెట్లో మార్పులు?

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.
Similar News
News February 15, 2026
కుప్పం: ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా సిలిండర్ కొనాల్సిందే..!

కుప్పం GH లో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా ఆసుపత్రి వారు మాత్రం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో కుప్పం GH కు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంటును అందజేశారు. అయితే అప్పటి YCP ప్రభుత్వం సైతం మరో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసింది. 2 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణ లోపంతో మరమ్మతులు కాగా సుమారు ఏడాదికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు.
News February 15, 2026
ఛావా, పుష్ప-2 రికార్డులు బ్రేక్

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోనూ ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్(59 రోజులు) ఇండియన్ ఫిల్మ్గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విక్కీ కౌశల్ ‘ఛావా’(58 D) రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో స్త్రీ-2(57 D), ప్రేమలు, పుష్ప-2(53 D), మంజుమ్మల్ బాయ్స్(50 D) ఉన్నాయి.
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.


