News July 17, 2024

యూపీ కేబినెట్‌లో మార్పులు?

image

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.

Similar News

News January 30, 2026

పచ్చదోమతో కందికి ముప్పు.. నివారణ ఎలా?

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్‌ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.

News January 30, 2026

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్<<>> ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech, ఎకనామిక్స్/MBA/పబ్లిక్ పాలసీ, BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటరాక్షన్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. PROకు నెలకు రూ.1.10L-రూ.1.5L, ROకు రూ.64K-రూ.1.10L, RAకు రూ.45K-రూ.80K చెల్లిస్తారు. వెబ్‌సైట్: vacancy.cercind.gov.in

News January 30, 2026

కరుంగలి మాల ధరిస్తున్నారా? ఇలా చేయండి!

image

కరుంగలి మాలను ధరించే ముందు సరైన పద్ధతిలో శుద్ధి చేయడం ముఖ్యం. మొదట మాలను పచ్చి పాలలో ముంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీనివల్ల మాల పవిత్రత పెరుగుతుంది. మీ కులదైవం/ఇష్టదైవం ముందు ఉంచి పూజించిన తర్వాతే ధరించాలి. జపం, ధ్యానం చేసే సమయంలో దీనిని ఉపయోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మాంసాహారం తినేటప్పుడు లేదా అశుభ కార్యాలకు వెళ్లేటప్పుడు మాలను తీసివేయడం మంచిదని పెద్దలు సూచిస్తుంటారు.