News August 8, 2024

హత్య కేసులో హీరో దర్శన్‌పై ఛార్జ్‌షీట్?

image

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో <<13490637>>దర్శన్<<>> సహా 17 మందిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ ప్రభుత్వాన్ని కోరింది. అక్కడి నుంచి అనుమతి రాకపోతే ప్రస్తుతం విచారణ జరుగుతున్న సివిల్ కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.

Similar News

News December 17, 2025

రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

News December 17, 2025

వారసత్వంగా వచ్చిన ఇంటికి వాస్తు పాటించాలా?

image

వారసత్వంగా వచ్చిన ఇంటికీ వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా శుభ ఫలితాలు కొనసాగుతాయంటున్నారు. ‘మీ పేరు బలం, జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా ఇంటి సింహద్వారం, ఇతర చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది. తద్వారా వారసత్వంగా వచ్చిన సుఖసంతోషాలు, సిరిసంపదలు అనుభవించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే, పరిస్థితులు మారి కష్టాలు రావచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 17, 2025

‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

image

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.