News October 13, 2024

మరణంలోనూ దాతృత్వం.. ఆస్పత్రికి సాయిబాబా డెడ్‌బాడీ

image

TG: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు జీఎన్ <<14342758>>సాయిబాబా<<>> అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిబాబా కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు డొనేట్ చేస్తామని చెప్పారు. ఆయన భౌతికకాయానికి స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించిన అనంతరం డెడ్‌బాడీని ఆస్పత్రికి అప్పగిస్తామన్నారు.

Similar News

News December 6, 2025

NRPT జిల్లాలో ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్: కలెక్టర్

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ శనివారం ప్రకటించారు. మొదటి, రెండవ విడత ఎన్నికలు పూర్తయిన గ్రామాలలో కూడా నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. తుదిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి గ్రామంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.

News December 6, 2025

కాలాలకు అతీతం ఈ మహానటి

image

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన ఆమె నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. నేడు మహానటి సావిత్రి జయంతి.