News November 29, 2024

త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం: కిషన్ రెడ్డి

image

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.428కోట్లతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు, అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఉంటాయన్నారు. మొత్తం 19 లైన్లలో 25 రైళ్ల జతలు రాకపోకలు కొనసాగించనున్నాయి. దీని వల్ల కాచిగూడ, HYD, SEC స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News October 21, 2025

సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

image

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్‌ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.

News October 21, 2025

సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

image

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.

News October 21, 2025

బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే..

image

వయసుతో సంబంధం లేకుండా చాలామంది హై బ్లడ్ ప్రెషర్‌(బీపీ)తో బాధపడుతున్నారు. ఉదయమే కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకోవడం, బీట్‌రూట్ జ్యూస్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, ఉసిరి జ్యూస్‌ వంటి వాటిలో నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT