News November 29, 2024
త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం: కిషన్ రెడ్డి

చర్లపల్లి రైల్వే స్టేషన్ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.428కోట్లతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లోని కొత్త శాటిలైట్ టెర్మినల్లో ఆధునిక సౌకర్యాలు, అన్ని ప్లాట్ఫారమ్లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఉంటాయన్నారు. మొత్తం 19 లైన్లలో 25 రైళ్ల జతలు రాకపోకలు కొనసాగించనున్నాయి. దీని వల్ల కాచిగూడ, HYD, SEC స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News December 29, 2025
ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసా?

దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.
News December 29, 2025
ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NDA, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ పరీక్ష ద్వారా UPSC త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ (MPC) ఉత్తీర్ణులు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్సైట్: upsc.gov.in/ *మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 29, 2025
IIT ధన్బాద్లో 105 పోస్టులు… అప్లై చేశారా?

<


