News February 6, 2025
మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ
ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.
Similar News
News February 6, 2025
కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News February 6, 2025
‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
News February 6, 2025
SBI ఆదాయం ₹1.28L CR, లాభం ₹16K CR
డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన SBI నికర లాభం రూ.16,791 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,164 కోట్లతో పోలిస్తే ఇది 84% పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,18,193 కోట్ల నుంచి రూ.1,28,467 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్ల నుంచి రూ.1,17,427 కోట్లకు ఎగిసింది. గ్రాస్ NPA 2.42 నుంచి 2.07, నెట్ NPA 0.64 నుంచి 0.53 శాతానికి తగ్గాయి.