News February 25, 2025

‘ఛావా’ కలెక్షన్ల దండయాత్ర

image

బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.353.61 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న ఒక్క రోజే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో నటించారు.

Similar News

News February 25, 2025

మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.

News February 25, 2025

NEPను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత రాజీనామా

image

తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రగడ మరింతగా ముదురుతోంది. తాజాగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విద్యార్థులపై బలవంతంగా మూడు భాషలను రుద్దడం అనేది చాలా తప్పని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

News February 25, 2025

నటిపై కేరళ కాంగ్రెస్ ఆరోపణలు.. రియాక్షన్ ఇదే

image

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు.

error: Content is protected !!