News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
Stock Markets: ఐదో రోజూ అదుర్స్

స్టాక్మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,266 (+78), సెన్సెక్స్ 76,580 (+238) వద్ద చలిస్తున్నాయి. ఐటీ, వినియోగం మినహా అన్ని సెక్టోరల్ సూచీలు ఎగిశాయి. రియాల్టి, హెల్త్కేర్, PSE, ఫార్మా, CPSE, మీడియా, ఎనర్జీ, చమురు, ఆటో, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ ఉంది. బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో, సన్ఫార్మా, బజాజ్ ఆటో, నెస్లే టాప్ గెయినర్స్. ఇన్ఫీ, HDFC బ్యాంకు, టైటాన్ టాప్ లూజర్స్.
News March 21, 2025
స్కూళ్లలో అల్పాహారం పథకం పెట్టాలి: KTR

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR డిమాండ్ చేశారు. ‘తమిళనాడులో ఈ స్కీమ్ను అమలు చేయడం వల్ల ఆస్పత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది. ఈ ఫలితాలను చూసి BRS ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
పట్టుబడిన కీచక ప్రొఫెసర్.. వెలుగులోకి కీలక విషయాలు

విద్యార్థినులపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న UPలోని హథ్రాస్కు చెందిన ప్రొఫెసర్ రజినీష్ కుమార్ పోలీసులకు దొరికాడు. మార్కులు వేస్తానని, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి అతను కంప్యూటర్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాడన్నారు. నిందితుడికి 1996లో పెళ్లైనా పిల్లలు లేరని తెలిపారు.