News February 28, 2025
వీటిల్లో తక్కువ ధరకే విమాన ప్రయాణం!

విమానంలో ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, విమానయాన సంస్థలను బట్టి టికెట్ ధరలుంటాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందిస్తోన్న సంస్థగా Air Asiaకి పేరుంది. దీని తర్వాత వోలోటియా, ఫ్లైనాస్, ట్రాన్సావియా ఫ్రాన్స్తో పాటు ఐదో స్థానంలో ఇండియాకు చెందిన ఇండిగో ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ ఎయిర్లైన్స్ జాబితాలో ఖతర్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి.
Similar News
News December 16, 2025
జాక్పాట్ కొట్టేదెవరో.. టీమ్ల వద్ద డబ్బులివే!

ఇవాళ అబుదాబిలో IPL మినీ వేలం జరగనుండగా ఈసారి ఏ ప్లేయర్ జాక్పాట్ కొడతారో అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏ జట్టు వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందో చూద్దాం. KKR(రూ.64.30కోట్లు), CSK(రూ.43.40కోట్లు), SRH (రూ.25.50కోట్లు), LSG (రూ.22.95కోట్లు), DC (రూ.21.80కోట్లు), RCB (రూ.16.40కోట్లు), RR (రూ.16.05కోట్లు), GT (రూ.12.90కోట్లు), PBKS(రూ.11.50కోట్లు), MI (రూ.2.75కోట్లు).
News December 16, 2025
ధనుర్మాసంలో శుభ కార్యాలు ఎందుకు చేయరు?

‘ధనుర్మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. అందుకే వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు’ అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష నిపుణుల కథనం ప్రకారం.. ధనుర్మాసంలో సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలు అలసి, విశ్రాంతి తీసుకుంటాయి. వాటి స్థానంలో గాడిదలు రథాన్ని లాగుతాయి. దీంతో సూర్యుని ప్రయాణం ఈ నెల రోజులు మందకొడిగా సాగుతుంది. అందుకే శుభకార్యాలకు ఈ సమయం మంచిది కాదని భావిస్తారు.
News December 16, 2025
నేడు విజయవాడలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 12PMకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్ వెళ్లి బాధితులతో మాట్లాడనున్నట్లు చెప్పింది. వారంతా ఇప్పటికే జగన్ను కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారంది. ఈ క్రమంలో ఆయన నేరుగా ఘటనా స్థలికి వెళ్లి బాధితులను కలవనున్నారని పేర్కొంది.


