News April 1, 2024
బలవంతంగా మోసం చేస్తున్నారు!

సుమారు 5000మంది భారతీయులు కంబోడియాలోని సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయారు. నేరస్థులు బలవంతంగా వారితో ఇండియాలోని పౌరులను ఆన్లైన్ ద్వారా మోసం చేయిస్తున్నారు. గత 6నెలల్లో రూ.500కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇక్కడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.67లక్షలు నష్టపోవడంతో స్కామ్ వెలుగు చూసింది. స్పందించిన కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దాదాపు 250 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది.
Similar News
News March 20, 2026
రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.
News March 20, 2026
300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు బ్యాన్

చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా అలాంటి 300 సైట్లు, యాప్లను నిషేధించింది. వాటిలో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ కేసినో ఆఫరింగ్ స్లాట్స్, లైవ్ డీలర్ టేబుల్స్, p-2-p బెట్టింగ్, రియల్ మనీ కార్డ్, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. మొత్తం 8,400 ఇల్లీగల్ సైట్లు ఉండగా కేంద్రం ఇప్పటివరకు 4,900 సైట్లను బ్లాక్ చేసింది.
News March 20, 2026
సర్ప్రైజ్ ఇస్తామన్నాడు.. కొన్ని గంటల్లోనే చంపేశారు

ట్రంప్, నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో IRGC కీలక ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయినీ మరణించారు. అంతకుముందు ‘మా దగ్గర క్షిపణుల నిల్వలు చాలా ఉన్నాయి. శత్రువుకు సర్ఫ్రైజ్లు ఇస్తాం’ అని నెతన్యాహును ఉద్దేశించి అలీ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని ధ్వంసం చేశామన్న ట్రంప్ కామెంట్లపైనా స్పందిస్తూ ‘ఆయనకు ధైర్యముంటే పర్షియన్ గల్ఫ్లోకి నౌకలను పంపాలి’ అంటూ సవాల్ విసిరారు.


