News August 6, 2024
అన్ని లారీలను తనిఖీ చేయండి: మనోహర్

AP: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు. 8 విభాగాల పర్యవేక్షణలో చెక్పోస్టులు ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ నుంచి ముంబై రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో నిన్న ఒక్కరోజే రీసైక్లింగ్ రేషన్ బియ్యం తరలిస్తున్న 6 లారీలను గుర్తించారు. దీంతో పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఇవాళ ఆదేశించారు.
Similar News
News January 12, 2026
పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.
News January 12, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పోస్టులు

కాన్పూర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 12, 2026
నెలలో పెళ్లి.. అమెరికా అదుపులో నేవీ అధికారి!

అమెరికా స్వాధీనం చేసుకున్న <<18803079>>రష్యా నౌకలో<<>> ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో హిమాచల్ ప్రదేశ్కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ రిక్షిత్ చౌహాన్(26) కూడా ఉన్నారు. ఫిబ్రవరి 19న ఆయన పెళ్లి జరగాల్సి ఉంది. రష్యా సంస్థ ఆయన్ను తొలిసారి సముద్ర విధులకు పంపింది. ఈ క్రమంలో ఈనెల 7న చౌహాన్తో మాట్లాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకును సురక్షితంగా తీసుకురావాలని తల్లి రీతాదేవి వేడుకుంటున్నారు.


