News February 24, 2025

CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

image

‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు జమ చేస్తారు. ఇవాళ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.22వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన వారి అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <>క్లిక్ <<>>చేసి తెలుసుకోండి.

Similar News

News December 5, 2025

అద్దెకు పురుషులు.. ఎక్కడో తెలుసా?

image

లాత్వియా దేశంలో పురుషుల కొరత కారణంగా మహిళలు “అద్దె” సేవలను వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్‌, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు వేయడంతో పాటు ఇతర పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది పార్ట్‌నర్‌ కోసం ఇతర దేశాలకు సైతం వెళ్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి సేవలు ఉన్నాయి.

News December 5, 2025

ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్‌తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.

News December 5, 2025

రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్‌ను ఫోర్స్ చేయలేదు: CBN

image

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.