News July 8, 2024
పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి: పోలీసులు

TG: మొబైల్ ఫోన్ వాడకంతో పిల్లలు తప్పుదారి పడుతున్నారని, 9వ తరగతి పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసులు సూచించారు. ‘పిల్లలు ఎదుగుతున్నారంటే వారికి చెడు దారులు సైతం ఎదురవుతాయి. మంచి- చెడు మధ్య తేడా తెలియని వారినే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత’ అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
>>SHARE IT
Similar News
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News January 24, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

గువాహటిలోని <
News January 24, 2026
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేశారు!

70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. ఛత్తీస్గఢ్లోని కోర్బాలో జరిగిందీ ఘటన. హస్దేవ్ లెఫ్ట్ కెనాల్పై 40ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. దాని బరువు 10 టన్నులపైనే ఉంటుంది. 15మంది కలిసి బ్రిడ్జిని కట్ చేసి, తుక్కు కింద అమ్మారని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.


