News October 30, 2024
పచ్చదనంతో ఈ సమస్యలకు చెక్!

పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు గుండె, షుగర్, BP వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లేనని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా పార్కులు, తోటల చుట్టూ ఉన్న ఇంట్లో నివసించడం వల్ల స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం తక్కువని తేలింది. చుట్టూ భవనాలతో నిండిన కార్యాలయాల్లో పనిచేయడం వల్ల శబ్ద కాలుష్యానికి గురికావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంది. BP, హార్ట్ బీట్ పెరగడానికి శబ్దకాలుష్యం ఓ కారణమని పేర్కొంది.
Similar News
News December 11, 2025
కర్నూలు జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా: ఎస్ఈ

కర్నూలు జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకి చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఎస్ఈ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్ భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం సూర్యఘర్ స్కీం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News December 11, 2025
నిర్భయంగా ఓటేయండి: ఆదిలాబాద్ ఎస్పీ

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.
News December 11, 2025
నేడు ధర్మవరానికి మధ్యప్రదేశ్ CM రాక

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా.మోహన్ యాదవ్ నేడు ధర్మవరానికి రానున్నారు. ‘అటల్–మోదీ సుపరిపాలన యాత్ర’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి సత్యకుమార్ కుమార్తె సంస్కృతి పేరిట నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.


