News September 29, 2024

తిరుమలలో చిరుత కలకలం

image

AP: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డులు టీటీడీ అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ తిరుమలలో సంచరించిన చిరుత ఓ చిన్నారిని చంపిన విషయం తెలిసిందే.

Similar News

News November 25, 2025

మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

image

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News November 25, 2025

మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

image

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News November 25, 2025

ప్రశాంతతను ప్రసాదించే విష్ణు నామం..

image

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన, దేవకీ నందనుడు అయిన కృష్ణుడి శక్తి కలిగిన, త్రిసామ అనే వేదాల సారం కలగలసిన పవిత్ర శ్లోకమిది. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>