News October 15, 2024
వాహనాలను కాపాడుకునేందుకు చెన్నై ప్రజల పాట్లు!

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై ప్రజలు అప్రమత్తమయ్యారు. వరద నుంచి రక్షించుకునేందుకు ద్విచక్రవాహనాలను ఇళ్లలో భద్రపరిచారు. అపార్ట్మెంట్లలోనూ పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేశారు. దీంతోపాటు చెన్నై, వేలచేరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపై స్థానికులు కార్లు పార్క్ చేసిన దృశ్యాలు వైరలవుతున్నాయి. విజయవాడలో వచ్చిన వరదల్లో కార్లు, బైక్లు పాడైన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఇలా కూడా తెలుసుకోవచ్చు

ఆన్లైన్లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఇలా కూడా తెలుసుకోవచ్చు

ఆన్లైన్లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.
News November 18, 2025
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గడువు పెంపు

TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును NOV 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ ఇది వర్తిస్తుంది. 2025 ఇంటర్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కాలర్షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవచ్చు. సైట్: scholarships.gov.in


