News January 12, 2025
నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.
Similar News
News November 29, 2025
TODAY HEADLINES

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత
News November 29, 2025
మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.
News November 29, 2025
‘ఒక్క రూపాయి లేదు.. కొంచెం క్యాష్ పెట్టండి’

తిరునెల్వేలి (TN)లో ఓ దొంగ రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. జేమ్స్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మదురైకి వెళ్లారు. అనంతరం ఫోన్లో చెక్ చేయగా ఇంటి CCTV పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూసేసరికి తలుపు పగిలి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఓ లేఖ దొరికింది. “ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు. కొంచెం అయినా క్యాష్ పెట్టండి” అంటూ రాసుకొచ్చాడు.


