News January 3, 2025

చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం

image

TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్‌ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.

Similar News

News October 18, 2025

పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

image

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్‌ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.

News October 18, 2025

CCRHలో 31 పోస్టులు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<>CCRH<<>>) 31 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి LLB, CA/ICWA, డిగ్రీ, M.VSc, PG, PhD, MSc, ఎంఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 6, 7, 8, 10, 11, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in

News October 18, 2025

బీసీ సంఘాల ‘రాష్ట్ర బంద్’.. నేతల వ్యాఖ్యలు

image

* బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కుట్రపూరితంగా స్టే తెచ్చారు. కోర్టులు మా మాట వినలేదు: R. కృష్ణయ్య
* రిజర్వేషన్లపై PM మోదీ వద్ద బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు: మహేశ్ కుమార్ గౌడ్
* బీసీ బిల్లు ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణం: మంత్రి కొండా సురేఖ
* కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానమే తప్పు: మాజీ మంత్రి తలసాని
* బీసీల హక్కులను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే: ఈటల