News January 6, 2025
చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం

TG: సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ను PM మోదీ ఇవాళ ఉదయం వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మించారు. సికింద్రాబాద్కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి.
Similar News
News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
News December 9, 2025
శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారా?

శ్రీశైలం సముద్ర మట్టానికి 1,500Ft ఎత్తులో, 2,830Ft శిఖరం కలిగిన పవిత్ర క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి పూజామందిరంగా, రాముడు, పాండవులు దర్శించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1,326-35లో దీనికి మెట్లు నిర్మించారు. ఎంతో కష్టపడొచ్చి దూళి దర్శనం చేసుకున్న భక్తులు పాతాళ గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి దైవానుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు.
News December 9, 2025
ఆండ్రూ యూల్& కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

ఆండ్రూ యూల్&కంపెనీ లిమిటెడ్ 12 అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును సంబంధిత విభాగంలో డిగ్రీ(ప్లాంటేషన్ మేనేజ్మెంట్/ఇంజినీరింగ్/ అగ్రికల్చర్/బయోసైన్స్/సైన్స్/ఆర్ట్స్/ కామర్స్), పీజీ, డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://andrewyule.com


