News December 29, 2024
14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.
Similar News
News February 14, 2026
మున్సిపాలిటీల్లో హంగ్.. వీరి ఓట్లే కీలకం

TG: రాష్ట్రంలో సుమారు 40కు పైగా స్థానాల్లో హంగ్ సూచనలు ఉండటంతో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. మేయర్, ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ ఎంపికలో MP, MLA, MLCలు ఓట్లు వేసే అవకాశం ఉంది. వీరు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలోని ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఫలితాల ఆధారంగా ఓటు నమోదు చేసుకోనున్నారు. ఇవాళ నమోదుకు ఆఖరు తేదీ కావడం గమనార్హం.
News February 14, 2026
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.
News February 14, 2026
జొన్న పంటలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

జొన్న పంటలో గింజలు పాలు పోసుకునే దశలో పిల్ల, పెద్ద పురుగులు ఆశించి రసం పీల్చుతాయి. దీని వల్ల గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ గింజలు కలిగి ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడ్డాక ఈ పురుగు ఆశించదు. కంకి నల్లి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


