News February 17, 2025

ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్‌ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.

Similar News

News January 20, 2026

అతి శక్తమంతమైన ‘హనుమాన్ గాయత్రీ మంత్రం’

image

‘‘ఓం ఆంజనేయాయ విద్మహే.. వాయుపుత్రాయ ధీమహి.. తన్నో హనుమత్ ప్రచోదయాత్’’
ఈ ఆంజనేయ గాయత్రీ మంత్రం అత్యంత శక్తిమంతమైనది. దీన్ని ధైర్యం, భక్తిని పెంపొందించుకోవడానికి రోజూ భక్తితో 11 సార్లు జపించాలని పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా దీన్ని పారాయణ చేస్తే ఆంజనేయుడి అనుగ్రహంతో అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. భయం పోయి మనోధైర్యం కలగడానికి ఇదో అద్భుతమైన మార్గం.

News January 20, 2026

రాష్ట్రంలో పశువులకు బీమా పథకం ప్రారంభం

image

AP: పశువుల అకాల మరణంతో రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం పశు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రీమియం మొత్తంలో ప్రభుత్వం 85% భరించనుండగా రైతు 15% చెల్లించాలి. మేలు జాతి పశువులకు ₹30,000, నాటు పశువులకు ₹15,000 వరకు కవరేజీ ఉంటుంది. ఈ నెల 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో రైతులు నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

News January 20, 2026

అమ్మాయిలూ ఇలా చేస్తున్నారా?

image

చాలామంది మహిళలు తమది సున్నిత మనస్తత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశముందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మహిళలు వాస్తవిక ధోరణితో ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా చూసుకోవాలి. భావోద్వేగాల పరంగా ఇతరులపై ఆధారపడే గుణాన్ని తగ్గించుకోవాలి. అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఆకతాయిల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలి.