News March 31, 2024
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు

నేడు ఈస్టర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘సత్యంలో ఉన్న శక్తిని, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన మహిమాన్వితమైన పర్వదినం ఈస్టర్’ అని ఏపీ సీఎం జగన్ పేర్కొనగా.. ‘మనుషుల్లో దేవుడిగా జన్మించి మానవత్వపు పరిమళాలను విశ్వవ్యాపితం చేసిన ఏసు క్రీస్తు స్మృతిలో జరుపుకునే వేడుక ఈస్టర్’ అని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
Similar News
News March 5, 2026
బిహార్లో తొలి బీజేపీ సీఎం.. రంగం సిద్ధం!

మోదీ నేతృత్వంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP అనేక రాష్ట్రాలపై పట్టు సాధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో బిహార్ కూడా చేరనుంది. సీఎం నితీశ్ RSకు వెళ్లనుండటంతో ఆయన స్థానంలో తొలిసారి <<19302367>>BJP నేత<<>> CM పీఠం ఎక్కే అవకాశం ఉంది. 2014 తర్వాత అస్సాంలో శర్బానంద, మణిపుర్లో బీరేన్సింగ్, త్రిపురలో బిప్లాబ్, హరియాణాలో మనోహర్, అరుణాచల్లో పెమా ఖండు, ఒడిశాలో మోహన్ BJP నుంచి తొలిసారి CMలు అయ్యారు.
News March 5, 2026
సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.
News March 5, 2026
లోన్పై బండి కొన్నారా? ఆ ఇబ్బంది ఉండదిక!

లోన్పై వెహికల్ తీసుకుంటే ఉండే హైపోథికేషన్ మార్క్ తొలగింపు ఇక ఈజీ కానుంది. రుణ చెల్లింపు పూర్తయితే RTOకు ఆన్లైన్లో బ్యాంకులు సమాచారం అందిస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ఫీచర్ను కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. SBI, 5 NBFCలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని త్వరలో అన్ని బ్యాంకులకూ విస్తరించనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే నో డ్యూ కాపీలు RTO ఆఫీసులకు వెళ్లి ఇస్తే ఇది పోతుంది.


