News October 29, 2024

చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్

image

AP: చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఇద్దరు నిందితులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది. 32 ఏళ్లుగా వారు జైల్లో మగ్గిపోతున్నారని హోంమంత్రి, న్యాయశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 1993లో హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును చలపతి, విజయవర్ధన్ దోచుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురుతిరగడంతో పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడంతో 23 మంది దుర్మరణం చెందారు.

Similar News

News November 24, 2025

వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

image

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 24, 2025

ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

image

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

image

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.