News March 19, 2024

సీఎంవోకి చేరిన చిలకలూరిపేట పంచాయితీ

image

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. స్థానిక వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడిని CM జగన్ పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఇన్‌ఛార్జ్‌‌గా రాజేశ్‌‌ని తప్పించిన అధిష్ఠానం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ కోసం మంత్రి రజినీ రూ.6.5కోట్లు తీసుకున్నారని రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Similar News

News August 28, 2025

నదుల అనుసంధానం చేస్తాం: ఆనం

image

AP: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి CM చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలోకి పోయే జలాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి వచ్చే జలాలను సోమశిల, కండలేరులో 150 TMCల చొప్పున నిల్వ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

News August 28, 2025

బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 28, 2025

US టారిఫ్స్‌కు GSTతో చెక్: BMI

image

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.