News January 27, 2025

పిల్లలను ఆ సమయంలో థియేటర్లలోకి అనుమతించొద్దు: హైకోర్టు

image

TG: సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను FEB 22కు వాయిదా వేసింది.

Similar News

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.