News January 27, 2025

పిల్లలను ఆ సమయంలో థియేటర్లలోకి అనుమతించొద్దు: హైకోర్టు

image

TG: సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రా.11 నుంచి ఉ.11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను FEB 22కు వాయిదా వేసింది.

Similar News

News November 20, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
> జిల్లా వ్యాప్తంగా ఇందిరా గాంధీ జయంతి
> కోటి చీరల పంపిణీపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
> వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది: కలెక్టర్
> ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు భేటీ
> మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది: ఎంపీ
> పెంబర్తిలో టాటా ఏస్ వాహనం బోల్తా

News November 20, 2025

శబరిమల: చిన్నారుల ట్రాకింగ్‌కు ‘Vi బ్యాండ్’

image

శబరిమలలో చిన్నారులు తప్పిపోకుండా వొడాఫోన్-ఐడియా(Vi)తో కలిసి కేరళ పోలీసులు ‘సురక్ష బ్యాండ్’లను తీసుకొచ్చారు. చిన్న పిల్లలతో శబరిమల వెళ్లే భక్తులు Vi సెక్యూరిటీ కియోస్కుల వద్ద, కేరళలోని అన్ని Vi స్టోర్లలో ఈ సురక్ష బ్యాండ్‌లను పొందొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా వీటికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాండ్‌కు ఒక స్పెషల్ డిజిటల్ కోడ్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు తప్పిపోతే వారిని దీని సాయంతో ట్రాక్ చేయొచ్చు.

News November 19, 2025

రాష్ట్రపతి ప్రశ్నలు.. రేపు అభిప్రాయం చెప్పనున్న SC

image

బిల్లుల ఆమోదం, సమయపాలన అంశాలకు <<17597268>>సంబంధించి <<>>రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రేపు అభిప్రాయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ విచారణలో బిల్లుల ఆమోదానికి గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపై న్యాయసలహా కోరుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు ముర్ము 14 ప్రశ్నలు వేశారు.