News November 14, 2024

బాలల దినోత్సవం: నవంబరు 14నే ఎందుకంటే..

image

దేశ తొలి PM నెహ్రూ పిల్లలతో సమయం గడపడాన్ని ఇష్టపడేవారు. స్వాతంత్ర్యోద్యమం కారణంగా తన సొంత బిడ్డ అయిన ఇందిరకూ దూరంగానే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో PM అయిన తర్వాత క్రమం తప్పకుండా పిల్లల్ని కలుస్తూ వారి సమక్షంలో సంతోషాన్ని పొందేవారు. 1964లో ఆయన కన్నుమూసిన తర్వాతి నుంచి జవహర్‌లాల్‌ జయంతిని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా జరుపుతోంది. అప్పటి వరకు అంతర్జాతీయ తేదీ అయిన నవంబరు 20న వేడుకలు జరిగేవి.

Similar News

News November 15, 2025

ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు

image

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్‌ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.

News November 15, 2025

iBOMMA నిర్వాహకుడికి నెటిజన్ల సపోర్ట్.. ఎందుకిలా?

image

పోలీసులు అరెస్టు చేసిన iBOMMA నిర్వాహకుడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు. OTT సబ్‌స్క్రిప్షన్ ధరలూ భారీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అతడు చట్టవిరుద్ధమైన పైరసీతో ఇండస్ట్రీకి భారీగా నష్టం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT?

News November 15, 2025

పర్స్ అమౌంట్.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?

image

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల <<18297320>>రిటెన్షన్, రిలీజ్<<>> ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో జరిగే మినీ వేలం కోసం KKR వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు, అత్యల్పంగా MI వద్ద రూ.2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక CSK(రూ.43.4 కోట్లు), SRH(రూ.25.5 కోట్లు), LSG(రూ.22.9 కోట్లు), DC(రూ.21.8 కోట్లు), RCB(రూ.16.4 కోట్లు), RR(రూ.16.05 కోట్లు), GT(రూ.12.9 కోట్లు), PBKS(రూ.11.5 కోట్లు) అమౌంట్ కలిగి ఉంది.