News January 28, 2025
చైనా AI దెబ్బ: గ్లోబల్ టెక్ కంపెనీల షేర్ల బిగ్గెస్ట్ క్రాష్

గ్లోబల్ టెక్ కంపెనీలకు చైనా డీప్సీక్ AI చుక్కలు చూపిస్తోంది. ఇండస్ట్రీస్కు తక్కువ ధర, ప్రజలకు ఫ్రీగా లభిస్తుండటమే ఇందుకు కారణం. తాజా R1 వెర్షన్కు కాంపిటీటివ్ ఎడ్జ్ ఉండటం సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు రేపింది. MON నాస్డాక్ ఫ్యూచర్స్, సీమెన్స్ ఎనర్జీ, టోక్యో ఎలక్ట్రాన్, EU టెక్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, ASML షేర్లు క్రాష్ అయ్యాయి. Nvidia ఏకంగా $593b సంపద కోల్పోయింది. నేడూ బ్లడ్బాత్కు ఆస్కారముంది.
Similar News
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.


