News April 11, 2025

అమెరికాపై 125% టారిఫ్ విధించిన చైనా

image

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికాకు కౌంటర్‌గా చైనా సుంకాలు పెంచింది. నిన్న చైనా ఉత్పత్తులుపై అమెరికా 145% టారిఫ్ విధించగా ఇవాళ చైనా 125% సుంకం విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బెదిరించాలని చూస్తున్నారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 18, 2025

RCB-PBKS మ్యాచ్ జరుగుతుందా? లేదా?

image

బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ జరగాల్సిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని IPL అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. అప్పటిలోపు వర్షం ఆగితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని అంపైర్లు తెలిపారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి, చెరో పాయింట్ ఇవ్వనున్నారు.

News April 18, 2025

ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలకు కపిల్ సిబల్ కౌంటర్

image

రాష్ట్రపతికి గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదన్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ <<16129153>>వ్యాఖ్యలపై<<>> రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఎంపీ కపిల్ సిబల్ ధన్‌ఖడ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా కలగజేసుకుంటుంది. అది దాని హక్కు. న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు.

News April 18, 2025

త్వరలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఇండియన్‌గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్‌శర్మ స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.

error: Content is protected !!