News November 8, 2024
మార్స్పై అతి పురాతన మహాసముద్రం.. గుర్తించిన చైనా

అంగారకుడిపై కోటానుకోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని చైనా పరిశోధకులు తేల్చిచెప్పారు. తాము పంపించిన ఝరాంగ్ రోవర్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిందని వారు వెల్లడించారు. ‘మార్స్పై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో నమూనాల ఆధారంగా పురాతన కాలంలో ఓ మహా సముద్రం ఉండేదని గుర్తించాం. సుమారు 3.42 సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఎండిపోయింది. ఆ సమయంలో సూక్ష్మ జీవులు అక్కడ మనుగడ సాగించి ఉండొచ్చు’ అని తెలిపారు.
Similar News
News October 18, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త!

ఇవాళ్టి నుంచి దీపావళి టపాసుల మోత మోగనుంది. ఈ సందర్భంగా పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచడం మేలు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్వి ధరించాలి. కాలికి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. క్రాకర్స్ను చేతిలో పట్టుకుని కాల్చకుండా, సురక్షితమైన దూరం పాటించాలి. కాల్చిన లేదా సగం కాలిన టపాసులను ముట్టుకోకూడదు. వాటిపై నీరు పోసి పారేయాలి. గడ్డివాములు, గుడిసెల దగ్గర అస్సలు పేల్చకూడదు.
News October 18, 2025
68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్హౌస్లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.