News October 2, 2024
చైనా PC, స్మార్ట్ మీటర్లపై సెక్యూరిటీ చెక్!

లెబనాన్లో పేజర్ పేలుళ్ల తర్వాత భారత్ మరింత జాగ్రత్తపడుతోంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న PC, LAPTOPS, స్మార్ట్ మీటర్లు, డ్రోన్ పార్ట్స్, పార్కింగ్ సెన్సార్ల భద్రతను టెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే CCTVలను తనిఖీ చేసి ఇంపోర్ట్స్ తగ్గించాలని నిర్ణయించింది. రీసెంట్గా ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్లోకి PC, LAPTOPSను తీసుకొచ్చిన కామర్స్ మినిస్ట్రీ DECలో ఆంక్షలు పెట్టొచ్చని సమాచారం.
Similar News
News October 19, 2025
ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్లోని ఆలమనగర్లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
News October 19, 2025
గృహిణి ఎన్ని వత్తుల దీపం పెట్టాలంటే?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు కూడా ప్రాధాన్యం ఉంది. గృహిణి స్వయంగా దీపం వెలిగించేటప్పుడు కుందిలో 5 వత్తులు ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఇవి కుటుంబంలోని 5 ముఖ్య అంశాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అంటున్నారు. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమానికి, రెండోది అత్తమామల శ్రేయస్సుకు, మూడోది తోబుట్టువుల క్షేమానికి ఉద్దేశించినవి. నాల్గోది గౌరవం, ధర్మ వృద్ధిని, ఐదోది వంశాభివృద్ధిని సూచిస్తుంది’ అని చెబుతున్నారు.
News October 19, 2025
దీపావళి: రేపు పొద్దున్నే స్నానం చేస్తే..?

దీపావళి రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలని సూచిస్తున్నారు. ‘నేడు నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి గంగా స్నాన ఫలం లభిస్తుంది. స్నానానంతరం తెలుపు వస్త్రాలు ధరించి, మినప ఆకు, మినపప్పుతో చేసిన వంటకాలు తినాలి’ అని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలు పాటించడం శుభప్రదం.