News July 4, 2024

వాస్తవాధీన రేఖను చైనా గౌరవించాలి: జైశంకర్

image

వాస్తవాధీన రేఖ(LAC)ని చైనా గౌరవించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌కు స్పష్టం చేశారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్యల్ని త్వరగా పరిష్కరించడంపై తాము చర్చించినట్లు ట్విటర్‌లో తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని నిర్దేశిస్తాయని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల

image

TG: పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.bse.telangana.gov.in/ సైట్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసినా హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

News March 4, 2026

ఇరాన్-US యుద్ధం.. కిమ్ జోంగ్‌పై పేలుతున్న మీమ్స్

image

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌పై నెట్టింట మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తరచూ అణు పరీక్షలతో కాలుదువ్వే ఆయనతో యుద్ధానికి ఎవరూ రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. తనను పట్టించుకోవడం లేదని కిమ్ బాధపడుతున్నట్లు, ఆయుధాలతో ఎదురు చూస్తున్నట్లు, ఎవరైనా అటాక్ చేశారా అని ఆకాశంలోకి చూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. కొన్ని మీమ్స్ పైన ఫొటోల్లో చూడొచ్చు.

News March 4, 2026

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

image

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్‌లోని యూఎస్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.